సింగర్ గీతా మాధురి అంటే తెలియని వారుండరు. గీతామాధురి తన మధురమైన గాత్రంతో అంతలా పేరు సంపాదించుకుంది. దశాబ్దకాలం నుంచి టాలీవుడ్ లోని చిన్న, పెద్ద సినిమాలను తన గాత్రాన్ని అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే మూడేళ్ళ క్రితం గీత, టాలీవుడ్ హీరో నందూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రియాలిటీ షో “బిగ్ బాస్” ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఈ షోలో ఫైనలిస్ట్ గా నిలిచింది గీత. దీంతో ఆమెకు మరింతగా పాపులారిటీ పెరిగింది. కాగా… గీతా మాధురి, నటుడు నందుల ముద్దుల కూతురు దాక్షాయణి ప్రకృతి. ఆగస్ట్ 9న వీరికి పండంటి పాప జన్మించగా, రీసెంట్గా ఆ పాపని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇక తాజాగా దాక్షాయణికి తెల్లటి దుస్తులు వేసి పక్కన మేకప్ కిట్ ఉంచి ఫోటోలు తీసింది గీతా. ఆ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేసింది. వాటిని చూసిన నెటిజన్స్ చిన్నారి ఎంతో క్యూట్గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
previous post
next post
నిన్ను ఎప్పటికీ మరచిపోలేను : మంచు విష్ణు