telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అడల్ట్‌ గ్రూప్స్‌లో నటి సెల్‌ఫోన్ నెంబర్ షేర్ చేసిన డెలివరీ బాయ్‌… కేసు నమోదు

gayatri-sai

అడల్ట్‌ గ్రూప్స్‌లో తమిళ నటి సెల్‌ఫోన్ నెంబర్ షేర్ చేసి అల్లరిపాలు చేసిన డెలివరీ బాయ్‌. ఈనెల 9న చెన్నైలోని తన ఇంటికి డోమినోస్‌ డెలివరీ బాయ్‌ పిజ్జా తీసుకుని వచ్చాడని గాయత్రి సాయి తెలిపారు. అనంతరం అతడు తన ఫోన్ నెంబర్‌ను అడల్ట్‌ గ్రూప్స్‌లో షేర్‌ చేశాడని చెప్పారు. దీంతో విపరీతమైన ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు వస్తున్నాయని గాయత్రి వాపోయారు. ఫోన్ కాల్స్‌తో విసుగెత్తిన ఆమె… తనకు సాయం చేయాల్సిందిగా తమిళనాడు పోలీసులను కోరారు. తన నెంబర్‌ ఇతరులకు షేర్‌ చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వాట్సాప్‌ మెసేజ్‌లను స్ర్కీన్‌ షాట్‌లను ఆమె ట్విటర్‌లో కూడా ఉంచారు. వాటితో పాటు పిజ్జా డెలివరీ బాయ్‌ ఫొటోను కూడా ఆమె షేర్‌ చేశారు.నటి గాయత్రి ఫిర్యాదు మేరకు.. తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పిజ్జా డెలివరీ బాయ్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. గాయత్రి సాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అంజలి చిత్రంతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచమయ్యారు.

Related posts