telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఉగ్రదాడిని ఖండించిన క్రికెటర్లు.. యుద్ధం చేయాల్సిందే: గంభీర్‌

Gautam Gambhir Pulwama Terror Attack

జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తీవ్రంగా కలత చెంది, భావోద్వేగానికి గురయ్యారు. ఆవేశంతో ఇక మాటల్లేవని, యుద్ధమే ఈ సమస్యకు పరిష్కారమని ట్విటర్‌ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు. ఇప్పటి వరకు జరిగింది చాలని, వెంటనే వేర్పాటు వాదులు, పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిందేనని అన్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు ఈ దాడిని ఖండిస్తూ అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు యావత్‌ దేశం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక టీమిండియా క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, సురేశ్‌ రైనాలు ఈ దాడిని ఖండిస్తూ ట్విటర్‌ వైదికగా వీర జవాన్లకు నివాళులర్పించారు.

Related posts