టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పు పై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం తాను టీడీపీలోనే ఉన్నానని, సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమని అన్నారు.
కార్యకర్తలు ఎవరూ సోషల్ మీడియా వార్తలను నమ్మవద్దని కోరారు. తాను కనుక పార్టీ మారాల్సి వస్తే అందరితో చర్చించాక, అందరికీ చెప్పే బయటకు వెళ్తానన్నారు. తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటిస్తానన్నారు. తాను పార్టీ మారబోతున్నానంటూ కొన్ని మీడియా సంస్థలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని గంటా మండిపడ్డారు.