telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పార్టీ మారే ప్రసక్తే లేదు.. జై టీడీపీ అంటూ గంటా ట్వీట్!

AP DSC Merit list released Minister Ganta

గత కొద్ది రోజులుగా ఈపీ టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు ఊపందుకొన్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే అంబిక కృష్ణ బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. మరికొందరు నేతలు కూడా కాషాయతీర్థం పుచ్చుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీలోకి వెళతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై గంటా స్వయంగా వివరణ ఇచ్చారు.

తాను పార్టీ మారతానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ తన గురించి విపరీతంగా వార్తలు ప్రసారమవుతున్నాయని, అలాంటి అసత్య కథనాల పట్ల స్పందించాల్సిన అవసరం తనకు లేదని ట్వీట్ చేశారు. ఎన్నికల ముందు కూడా ఇలాంటి కథనాలే వచ్చాయని, ఇప్పుడు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని జై టీడీపీ అంటూ ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు.

Related posts