telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఉచిత విద్యుత్ ఇవ్వండి .. ఏపీసీఎం కి లేఖ రాసిన .. గన్నవరం ఎమ్మెల్యే…

gannavaram mla letter to apcm on free power

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలవరం కుడికాల్వలోని మోటార్లకు విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా వచ్చే నీటిని రైతులకు దక్కేలా సాయం చేస్తానని, 500 మోటార్లు ప్రభుత్వానికి ఇస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు.

గతంలో తాను ఏర్పాటు చేసిన మోటార్లకు ప్రభుత్వం నాలుగేళ్లుగా విద్యుత్ సరఫరా చేసిందని గుర్తు చేశారు. రైతుల సౌలభ్యం కోసం మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తన లేఖలో వంశీ కోరారు. దీనిపై సీఎం ఇంకా స్పందించాల్సి ఉంది.

Related posts