వెస్టిండీస్ తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో ధోనీకి సెలక్టర్లు చోటు కల్పించకపోవడంపై టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పందించాడు. ధోనీని తీసుకుంటారని తాను అనుకోలేదన్నాడు. ప్రస్తుతం పరిస్థితుల్లో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. ‘దక్షిణాఫ్రికా సిరీస్కు ధోనీని ఎంపిక చేయకపోవడం మీకు ఆశ్చర్యం కలిగించిందా?’ అన్న ప్రశ్నకు గంగూలీ పై విధంగా సమాధానం ఇచ్చాడు.
సెలక్టర్ల నిర్ణయం తనను ఆశ్చర్యపరచలేదన్నాడు. రిషభ్ పంత్కు మరిన్ని అవకాశాలు కల్పించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోందన్నాడు. అతడిని కొనసాగించడం సరైనదేనన్నాడు. ధోనీ కూడా యువకుడిగానే జట్టులో అడుగుపెట్టాడని గంగూలీ గుర్తు చేశాడు.