telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

‘వెల్ డన్ బంగ్లాదేశ్’.. గంగూలీ కితాబు!

sourav ganguly as bcci president

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢిల్లీలో నిన్న జరిగిన తొలి టీ20 మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, షెడ్యూల్ ప్రకారం ఎలాంటి ఆటంకాలు లేకుండా మ్యాచ్ ముగిసింది. నిన్నటి మ్యాచ్ లో భారత్ పై బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్ కు ప్రేక్షకులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఇరు జట్లకు ధన్యవాదాలు తెలిపారు. వాయు కాలుష్యం కారణంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా మ్యాచ్ ఆడి, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారంటూ ఇరు జట్ల ఆటగాళ్లకుఅభినందనలు తెలిపారు. ‘వెల్ డన్ బంగ్లాదేశ్’ అంటూ గంగూలీ కితాబిచ్చారు.

Related posts