telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

గణేష్ మండపాలకు అనుమతి లేదు!

khairatabad ganesh nimajjanam utsav started

ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే వినాయక చవితి ఉత్సవాలకు ఈసారి బ్రేక్ పడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే గణేష్ ఉత్సవాలకు సంబంధించి పలు రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. విగ్రహం ఎత్తుతో పాటు గణేష్ మండపాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై పలు ఆదేశాలను జారీ చేశాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో వినాయక చవితి ఉత్సవాలపై అధికారులు నిభంధనలను విధించారు. విజయవాడలో చవితి పందిర్లకు అనుమతి లేదని సీపీ శ్రీనివాసులు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో అనుమతులు ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. అందరూ ఇళ్లలోనే గణేష్‌ పండుగ జరుపుకోవాలని శ్రీనివాసులు సూచించారు.

Related posts