telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సియోల్ యోన్సీ యూనివర్సిటీలో.. గాంధీ విగ్రహం ఆవిష్కరించిన మోడీ..

gandhi statue in seoul yonsei university

భారత ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన సియోల్‌లోని యోన్సీ యూనివర్సిటీలో మహాత్మా గాంధీ ప్రతిమను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ పాల్గొన్నారు. గాంధీ ప్రతిమను ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నట్లు మోదీ తెలిపారు.

గాంధీ 150వ జయంతి సమయంలో ఈ ప్రతిమను ప్రారంభించడం మరీ ప్రత్యేకంగా భావిస్తున్నట్లు చెప్పారు. బాపూ ఆలోచనలు శక్తివంతమైనవని, మానవులు ఎదుర్కొంటున్న ఉగ్రవాదం, వాతావరణమార్పుల లాంటి సమస్యలను అధిగమించే సత్తా ఆ ఆలోచనలకు ఉందన్నారు. సామరస్యంగా ఎలా జీవించాలన్న దానిని గాంధీ తన జీవితంతో చూపించారన్నారు.

Related posts