భారత ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన సియోల్లోని యోన్సీ యూనివర్సిటీలో మహాత్మా గాంధీ ప్రతిమను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ పాల్గొన్నారు. గాంధీ ప్రతిమను ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నట్లు మోదీ తెలిపారు.
గాంధీ 150వ జయంతి సమయంలో ఈ ప్రతిమను ప్రారంభించడం మరీ ప్రత్యేకంగా భావిస్తున్నట్లు చెప్పారు. బాపూ ఆలోచనలు శక్తివంతమైనవని, మానవులు ఎదుర్కొంటున్న ఉగ్రవాదం, వాతావరణమార్పుల లాంటి సమస్యలను అధిగమించే సత్తా ఆ ఆలోచనలకు ఉందన్నారు. సామరస్యంగా ఎలా జీవించాలన్న దానిని గాంధీ తన జీవితంతో చూపించారన్నారు.
Through his lifestyle, Bapu showed what living in harmony with nature is. He also showed that it is important to leave a clean and green planet for the future generations: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 21, 2019
కమల్ పై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు