telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఘనంగా .. మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు ..

gandhi 150th birthday celebrations

దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు జాతిపిత సేవలు, ఆశయాలను స్మరించుకుంటున్నారు. దిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు సైతం మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అనిల్‌ శాస్త్రి, భాజపా అధ్యక్షుడు జేపీ.నడ్డా నివాళులర్పించిన ప్రముఖుల్లో ఉన్నారు. అనంతరం అక్కడ జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు.

సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశ స్వాతంత్ర్య సంగ్రామ సారథిగా జనసంద్రాన్ని కదిలించిన మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతిపిత జయంతి ఉత్సవాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

Related posts