దిల్లీ తూర్పు నియోజకవర్గానికి భారత మాజీ క్రికెటర్, భాజపా నేత గౌతమ్ గంభీర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. దానికి ముందు పూజా కార్యక్రమాలు, మద్దతు దారులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. నామినేషన్కు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ..’నా ఉద్దేశం సరైంది. నా దేశానికి నా వంతుగా సేవ చేయాలనుకుంటున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను’ అని ఆయన వెల్లడించారు.
నెలరోజుల క్రితం పార్టీలో చేరిన గంభీర్ను దిల్లీ తూర్పు నియోజక వర్గం నుంచి బరిలోకి దింపుతున్నట్లు భాజపా ప్రకటన చేసింది. దిల్లీలో మే 12న ఎన్నికలు జరగనున్నాయి. గంభీర్ ట్విటర్లో చురుగ్గా ఉంటూ సమకాలీన అంశాల మీద తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా భాజపాలో చేరిన తరవాత జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా తీరును ఎండగట్టారు.
చంద్రబాబు మౌనీ బాబా అయ్యారు: : విజయసాయి