టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మీడియా స్వేచ్ఛపై లోక్ సభలో ప్రస్తావించారు. పార్లమెంట్ లో ఆయన మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛను అణగదొక్కేలా ఏపీ ప్రభుత్వం జీవోను తీసుకొచ్చిందని చెప్పారు. ఈ జీవో విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని కార్యదర్శులకు ఇచ్చారని తెలిపారు.
మంత్రులు, అధికారులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే కేసులు పెట్టడం ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛను హరించడమేనని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే ఓ జర్నలిస్టును ఒక ఎమ్మెల్యే అనుచరులు హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో టీవీ5, ఏబీఎన్ ఛానళ్లపై నిషేధం ఉందని, దాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
వాలంటీర్ల అరాచాకాలు ముఖ్యమంత్రికి కనిపించటం లేదా? – బండారు శ్రావణి