నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ కు ఈ రోజు బెయిల్ మంజూరు అయింది. మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో జయదేవ్ తరఫు న్యాయవాది బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా, ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.
బెయిల్ పత్రాలు గుంటూరు సబ్ జైలు అధికారులకు అందిస్తామని, ఆపై సాయంత్రంలోగా గల్లా విడుదల అవుతారని ఆయన తరఫు న్యాయవాదలు తెలిపారు. ఏపీ రాజధానిని మూడు ప్రాంతాలకు మార్చడంపై గల్లా జయదేవ్ నిన్న నిరసన చేపట్టారు. ఆయనపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసునునమోదు చేశారు.
పవన్ కల్యాణ్ లాంగ్మార్చ్ అట్టర్ఫ్లాఫ్: విజయ సాయిరెడ్డి