telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

పదోతరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌…

కరోనా కారణంగా విద్యార్థులు ఈ ఏడాది విద్యా సంవత్సరం తీవ్రంగా నష్టపోయారు. అయితే… ఈ విద్యాసంవత్సరాన్ని వృథా కావివ్వొద్దన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పాఠశాలలను కొద్ది రోజుల క్రితమే పునః ప్రారంభించాయి. అయితే… విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పలు బోర్డు పరీక్షల సిలబస్ ను ఇప్పటికే తగ్గించాయి. విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్‌ను సైతం అందించేందుకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది. పదో తరగతి పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న వారందరికీ ఉచితంగా స్టడీ మెటీరియల్‌ అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 2.20 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఈ స్టడీ మెటీరియల్స్‌ను అందించనున్నారు. కాగా.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్‌ను అందించిన విషయం తెలిసిందే.

Related posts