ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ వర్తింపజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ చేస్తున్న విమర్శలపై ని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. టీడీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన కోరారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో జగన్ వెనకడుగు వేయరని చెప్పారు.
రైతులను అన్ని విధాలా ఆదుకోవడమే సీఎం అభిమతమని తెలిపారు. ఉచిత విద్యుత్ కు నగదు బదిలీ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని కోరారు. వాస్తవానికి ఉచిత విద్యుత్ అనేది ఎవరో పోరాడి సాధించుకున్నది కాదని చెప్పారు. దివంగత వైయస్ తీసుకొచ్చిన పథకమని చెప్పారు. పెరిగిన కరెంటు చార్జీలపై నిరసన చేస్తున్న వారి ప్రాణాలు తీసిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. వైయస్ ఆలోచనలతో పుట్టిన ఉచిత విద్యుత్ పథకానికి ఆటంకం కలగదని సజ్జల చెప్పారు.
ఫలితాల రోజే కూటమి సమావేశం: చంద్రబాబు