హైద్రాబాద్ నగరంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రోజు రోజుకు పుట్టగొడుగుల్లా ప్లస్ మెంట్ కార్యాలయాలు పుట్టుకొస్తున్నాయి. వీరి వలలో చిక్కి ఎందరో నిరుద్యోగులు మోసపోస్తున్నారు. తాజాగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మీడియా త్రీ ఇంటర్నేషనల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ నిర్వాహకులు పలువురు నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు దండుకున్నారు.
ఒక్కొక్కరి నుంచి రూ. లక్షా 50 వేలు వసూలు చేసినట్లుగా సమాచారం. తాము మోసపోయినట్లుగా గుర్తించిన అభ్యర్థులు అమీర్పేట్లోని ఆదిత్య ట్రెడ్ సెంటర్ ఫ్లాట్ నెంబర్ 205 వద్ద ఆందోళనకు దిగారు. కాగా తమ కార్యాలయం ఎదుట కొందరు న్యూసెన్స్ చేస్తున్నారంటూ కంపెనీ నిర్వాహకులు పోలీసులకు ఉల్టా ఫిర్యాదు చేశారు. బాధిత నిరుద్యోగులు ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు.
టీడీపీకి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ముఖ్యం: మంత్రి కన్నబాబు