ఇప్పటి వరకు మందుబాబులు ఫుల్గా మందేసి.. రోడ్డుపైకి వచ్చి నానా రచ్చ చేసేవారు.. తాజాగా హైదరాబాద్లో యువతులు కూడా ఇలాగే నానా హంగామా చేసిన విషయం హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే… దిల్సుఖ్నగర్ సమీపంలోని చైతన్యపురిలో ఓ వైన్స్ దగ్గర కొంతమంది యువతులు మద్యం మత్తులో హల్చల్ చేస్తున్నారు. వైట్నర్ పీలుస్తూ, మద్యం తాగి.. వైన్స్ ఎదురుగా ఉన్న బస్స్టాప్లో తిష్ట వేస్తున్నారు నలుగురు యువతులు. అంతేకాదు అక్కడికి మద్యం కొనడానికి వచ్చే వారితో, రోడ్డుపై వెళ్లే వారితో గొడవపడుతూ నానా హంగామా సృష్టిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో యువతులు మరింత రెచ్చిపోతూ దారిన పోయే వారిపై దాడులకు పాల్పడుతూ డబ్బులు కూడా లాక్కుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో యువతులు మద్యం మత్తులో వైన్ షాప్ ముందు ఓ యువకుడిపై దాడి చేశారు. అక్కడ బస్స్టాప్లో పడుకొని ఉన్న మరో యువకుడి బట్టలిప్పి డబ్బులు లాక్కున్నారని వారు తెలిపారు. దీంతో ఇద్దరు యువకులు భయంతో అక్కడి నుంచి పారిపోయారని చెబుతున్నారు. రోడ్డుపై బహిరంగంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
previous post