telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

నాలుగు రోజుల లాభాలలో .. మార్కెట్లు..

husge loses again in stock markets

జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు స్థిరంగా ఉండటంతో గత నలుగు రోజులుగా మార్కెటు స్వల్ప లాభాలతో ముగుస్తుండటం విశేషం. నేడు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగింది. వరుసగా నాలుగో రోజు మన స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఒకానొక సమయంలో 200 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్ ఆ తర్వాత కొంత లాభాలను కోల్పోయింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 36,725కు పెరిగింది. నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 11,058 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (2.76%), యాక్సిస్ బ్యాంక్ (1.77%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.71%), ఐటీసీ (1.61%), ఎస్బీఐ (1.26%).

టాప్ లూజర్స్:
కోల్ ఇండియా (3.09%), సన్ ఫార్మా (1.97%), ఎన్టీపీసీ (1.68%), ఓఎన్జీసీ (1.58%), యస్ బ్యాంక్ (1.47%).

Related posts