నిన్న అర్ధరాత్రి కన్నుమూసిన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. 86 సంవత్సరాల నాయిని బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించాలని సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. ఈ రోజు అంత్యక్రియల్లో భాగంగా నాయిని పాడెను మోశారు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్.. తదితర ప్రజాప్రతినిధులు.. ఇక, నాయినిని కడసారి చూసేందుకు జనం, టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.. మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు అంతమియాత్ర కొనసాగింది.. మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.. అంత్యక్రియల్లో కేటీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ శ్రేణులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.