telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తిరుమల : … వృద్దులకు .. ఉచిత దర్శనం..

TTD gold thefted will be to Tirumala today

తిరుమలలో శ్రీవారి దర్శనం 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు 30 నిమిషాల్లో ఉచిత దర్శనం చేయించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇందుకు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు.. ఇలా రెండు సమయాలను కేటాయించినట్టు చెప్పారు. ఫొటోతో ఉన్న వయసు నిర్ధారణ పత్రాలు తమ వెంట ఉంచుకొని భక్తులు ఎస్-1 కౌంటర్ వద్ద చూపించాల్సి ఉంటుంది. వీరి దర్శనం కోసం మిగతా అన్ని లైన్లను నిలిపేస్తారు.

ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద మెట్లు ఎక్కాల్సిన పనిలేదు. కూర్చొనేందుకు మంచి సీట్లు ఏర్పాటు చేసి ఉంటాయి. సాంబార్ అన్నం, పెరుగన్నం, వేడిపాలు ఉచితంగా ఇస్తారు. వీరికి రూ.20కే రెండు లడ్డూలు అందజేస్తారు. ఇంకా లడ్డూలు కావాలనుకుంటే రూ.25కు లడ్డూ చొప్పున అందిస్తారు. కౌంటర్ నుంచి గుడికి, గుడి నుంచి కౌంటర్ వరకు బ్యాటరీ కారులో ఉచితంగా చేరవేస్తారు.

Related posts