telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

శ్రీశైలంకు పెరుగుతున్న వరద…

శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద నీరు పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా వరద పెరిగిన ఇప్పుడు ఆ వర్షాలు తగ్గడంతో జలాశయంలో వచ్చే ఇన్ ఫ్లో తగ్గుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 6,586 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం నిల్ గానే ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 818.20 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 39.5529 టీఎంసీలు ఉంది. అయితే ఇప్పటికి కూడా కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి మాత్రం ప్రారంభం కాలేదు. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts