ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో చాలాచోట్ల పంటలు నీట మునిగాయి. ఆరుగాలం శ్రమించి అధిక పెట్టుబడులతో సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయంలో పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా గోదావరి జిల్లాలకు రూ.10 కోట్ల 9 లక్షల 20 వేల ప్రత్యేక వరద సాయాన్ని విడుదల చేసింది.ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
గోదావరి వరదల కారణంగా ఇళ్లు దెబ్బతిన్నవారికి రూ.5,000 అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నిధుల్లో రూ. 7,21,75,000 తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించగా, మరో రూ. 2,87,45,000ను పశ్చిమ గోదావరి జిల్లాకు ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులను సంబంధిత లబ్ధిదారులకు వెంటనే అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
బీజేపీతో మళ్లీ పొత్తు కోసం చంద్రబాబు తహతహ: సోము వీర్రాజు