ఇండియాలోనే మొట్టమొదటి సరిగా రోబోలతో సర్వింగ్ చేయిస్తున్న హోటళ్ గా, చెన్నై నగరంలోని ముగిలివాక్కం పోరూర్ ప్రాంతంలోని రోబోట్ రెస్టారెంట్లో చరిత్ర సృష్టించింది. దీనిలో రోబోలే వెయిటర్లుగా పని చేస్తున్నాయి. కస్టమర్లను పలకరించడం నుండి కిచెన్లోకి వెళ్లి ఆహారాన్ని తెచ్చి వడ్డించడం వరకూ రోబోలే సర్వీస్ చేస్తున్నాయి.
ఈ తరహా హోటల్ దేశంలోనే ఇదే మొదటిది..! ప్రస్తుతం తమిళ్, ఇంగ్లీషులో మాట్లాడ గల ఈ రోబోలను.. ఒక్కోటి రూ.5 లక్షలు పెట్టి కొన్నట్లు హోటల్ యాజమాన్యం తెలిపింది. వీటిని పలకరించడానికైనా అక్కడకు కస్టమర్లు వస్తుండటం విశేషం.