telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బిహార్ ఎన్నికలు: ముగిసిన మొదటి దశ పోలింగ్‌

62.6 percent polling in 3rd phase

బీహార్ మొదటి దశ పోలింగ్…అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపు తప్ప ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 52.24 శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం ఓటింగ్ జరిగిన ప్రాంతాలు 2015లో లాలు ప్రసాద్ యాదవ్ కు భారీ సంఖ్యలో మెజారిటీ అందించిన వి కావడం గమనార్హం. అయితే ఓటింగ్ శాతం తక్కువగా నమోదైనట్లు సమాచారం. కరోనా మహమ్మారి నేపథ్యంలో కూడా కొంత కారణం కావచ్చు. 2015 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతమే ఈ ఎన్నికల్లోనూ నమోదైనట్లు కనిపిస్తోంది. సాయంత్రం ఐదు గంటలకు 51.8 శాతమే నమోదైంది. చివరి గంటల్లో చెప్పుకోదగ్గ పోలింగ్ నమోదు కాలేదు. 0.5 శాతం నుంచి 2 .0 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కావచ్చు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 56.1 శాతం పోలింగ్ నమోదైంది.మొదటి దశ పోలింగ్ కాస్త అటు ఇటు గా అదే శాతం నమోదైనట్లు కనిపిస్తోంది. బీహార్  లో మొత్తం 243 సీట్లకు గాను తొలి దశలో 71 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరిగింది.

Related posts