ప్రస్తుతం నితిన్ వరుస సినిమాలు చేస్తూ బిజుగా ఉన్నాడు. అయితే అందులో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న చిత్రం చెక్. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ ఖైదీగా నటిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన లాయర్ పాత్రను పోషించారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈరోజు ఈ సినిమా నుంచి సరికొత్త అప్డేట్ను ఇచ్చారు. చెక్ లిరికల్ పాటను రేపు మధ్యహ్నం 2 గంటల సమయంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోస్టర్ను విడుదల చేశారు. ‘నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను’ అంటూ సాగనున్న పాట రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాట ప్రియా ప్రకాష్ వారియర్, నితిన్ ఇద్దరి మధ్య చోటుచేసుకోనున్నట్లు అర్థం అవుతోంది. అయితే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.