మీడియా టీమ్పై దుండగులు కాల్పులు జరిపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో ఒక ప్రైవేట్ న్యూస్ చానల్కు చెందిన రిపోర్టింగ్ టీమ్పై దుండగులు మూడు తూటాలు పేల్చారు. తరువాత ఆ న్యూస్ చానల్ వాహనాన్ని ఒక కిలోమీటర్ దూరం వరకూ వెంబడించారు. అత్యంత కష్టమీద ఆ న్యూస్ టీమ్ ప్రాణాలతో బయపడగలిగింది.
కాగా ఆ న్యూస్ టీమ్ ఐఎన్ఏ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారి సహాయం అందలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నిందితులు బైక్పై వచ్చారు. ఎట్టకేలకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.