పుల్వామాలో లో ఇంకా హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. నేటి ఉదయం కూడా ఉగ్రవాదులకు, సైనిక జవాన్లకు మధ్య ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు, ఓ ఆర్మీ జవాన్ మరణించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలోని దాలిపొర ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం మేర భారత సైనికులు, ప్రత్యేక పోలీసు దళం జవాన్లతో కలిసి గాలింపు చేపట్టారు.
భద్రతాబలగాలు గాలిస్తుండగా ఎదురైన ఉగ్రవాద సంస్థకు చెందిన కొందరు మిలిటెంట్లు కాల్పులు జరిపారు. దీని తో ఆర్మీ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు.ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య గురువారం భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఎదురుకాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ కూడా మరణించగా, మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.