telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు..13 మంది దుర్మరణం

fire building

టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, సుమారు 50 మంది మంటల్లో చిక్కుకొన్నారు. పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ లో బుధవారం సాయంత్రం ఈ ఘటన చేసుకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ నివాస ప్రాంతాల మధ్య ఉందని బోర్డర్ రేంజ్ ఐజీ పర్మార్ తెలిపారు.

విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలను చేపట్టారు. పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఫ్యాక్టరీలో ఉన్న సుమారు 50మందికిపైగా ఈ మంటల్లో చిక్కుకొన్నారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఘటన స్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.

Related posts