telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

రబ్బరు ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..ఐదుగురు దుర్మరణం

huge fire in seshachalam forest

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిది. నగరంలోని జిల్‌మిల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రబ్బరు ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఘటనా స్థలానికి చేరుకున్న 26 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.

Related posts