సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారి పక్కన ఉన్న దుకాణాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడడంతో పండ్ల దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. దుకాణాలవద్ద వెనుక ఉన్న చెత్తకు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పరిసర ప్రాంత ప్రజలు పరుగులు తీశారు. జాతీయ రహదారి పక్కనే ఉండడంతో వాహన చోదకులు భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
previous post