ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కరకట్ట పక్కన ఎండుగడ్డి తగులబడటంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు పక్కకు వ్యాపించడంతో అరటి తోట దగ్ధమైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు.
విష్యం తెలుసుకున్న అగ్రిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీ భద్రత ఉండే ముఖ్యమంత్రి నివాసం సమీపంలో మంటలు చెలరేగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎండ వేడికి ఈ మంటలు వచ్చాయా? లేక ఎవరైనా సిగరెట్ కాల్చి పడేయడంతో మంటలు చెలరేగాయా? అన్న విషయమై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు: మంత్రి బొత్స