దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ముంబైలోని నాగ్ పడ్ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్లో గురువారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాల్ యొక్క రెండవ, మూడవ అంతస్తులలో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే 20 అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి. ఘటన సమయంలో మాల్ లో 200 నుంచి 300 ఉన్న మందిని సురక్షితంగా కాపాడారు. ముంబై చీఫ్ ఫైర్ ఆఫీసర్ శశికాంత్ కాలేతో సహా సుమారు 24 ఫైర్ ఇంజన్లు మరియు 250 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి కృషి చేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో నలుగురు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం వరకు మంటలు అదుపులోకి రాలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా లాక్ డౌన్ విధించిన అప్పటినుంచి ఇలాంటి అగ్నిప్రమాదాలు జరుగుతుండటం విశేషం.
previous post