telugu navyamedia
ట్రెండింగ్

బెంగుళూరు.. ‘ఏరో ఇండియా 2019’ లో .. అగ్నిప్రమాదం.. 150 కార్లు దగ్ధం..

fire accident in aero india 2019 parking place

బెంగళూరు యలహంక ఎయిర్‌బేస్‌ స్టేషన్‌ సమీపంలోని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ‘ఏరో ఇండియా 2019’ ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు పార్క్ చేసిన వాహనాల వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో దాదాపు 150 కి పైగా కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. వాటితో పాటు 100 కార్ల వరకు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం.

ఈ ఘటనా తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పది అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్కింగ్‌ స్థలంలో కొన్ని వందల కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 20 నుంచి 24 వ తేదీ వరకు ఎయిర్ షో జరగనుంది. ఎయిర్ షోను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు

Related posts