హైదరాబాద్ శివారులోని చర్లపల్లి ఫేస్ త్రీ ఇండస్ట్రీ ఎస్ఈఆర్ ఎంటర్ ప్రైజెస్లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు రెండు కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయినప్పటికీ రూ.2 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు గుర్తించారు. ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
previous post