యంగ్ హీరో ఆకాష్ పూరి హీరోగా పరిచయమైన తొలి సినిమా ‘మెహబూబా’ తో నే విమర్శకుల ప్రశంశలు అందుకున్నాడు. ప్రస్తుతం ఆకాశ్ పూరి, కేతికా శర్మజంటగా నటిస్తున్న చిత్రం “రొమాంటిక్”. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సెట్స్లో మంటలు రేగాయి. ఆ మంటలను ఆపడానికి చిత్ర యూనిట్ ప్రయత్నించింది. టీమ్ సభ్యులు సకాలంలో స్పందిచండంతో పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. అనిల్ పాదూరి దర్శకుడు. “ఇస్మార్ట్ శంకర్” వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్పై పూరి జగన్నాథ్, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో ఆకాశ్, హీరోయిన్ కేతికా శర్మను కౌగిలించుకున్న స్టిల్ను ఫస్ట్ లుక్గా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే సినిమా హైదరాబాద్, గోవా షెడ్యూల్స్ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్లోనే షూటింగ్ జరుగుతోంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నరేశ్ సినిమాటోగ్రఫీని అందించారు. మందిరా బేడి, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో నటించారు.
previous post
చెన్నై నగరం నీరు లేని నగరంగా మారింది… హాలీవుడ్ హీరో కామెంట్స్