హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎదులబాద్ గ్రామంలో ఓ అట్టల తయారీ పరిశ్రమలో మంటలు అంటుకుని భారీగా అగ్నికీలలు ఎగిసి పడ్డాయి. ఈ ప్రమాదంలో డీసీఎం వాహనం దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసరప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కంపెనీలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరగడంతో కార్మికులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. సుమారు రూ.5లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
previous post
next post