బ్యాంకుల విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి అతిపెద్ద సంస్థ ఏర్పడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అన్నారు. రుణ వ్యయం కూడా తగ్గుతుందని జైట్లీ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాల కొరత ఉండబోదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులైన దేనా బ్యాంకు, విజయా బ్యాంక్ను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది.
దీనిపై జైట్లీ ఈ రోజు లోక్సభలో మాట్లాడుతూ.. బ్యాంకు నిరర్ధక ఆస్తులు తగ్గుతున్నాయని, రూ. 3లక్షల కోట్లను తిరిగి వ్యవస్థలోకి తెచ్చేందుకు దివాల చట్టం సాయపడిందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల రీకాపిటలైజేషన్ కింద డిసెంబరు 31 నాటికి రూ. 51,533కోట్లను బ్యాంకులకు ఇచ్చినట్లు తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో రూ.65వేల కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకుల రికాపిటలైజేషన్ కోసం కేటాయించామన్నారు. ఇందులో డిసెంబరు 31 నాటికి రూ. 51,533 కోట్లను బ్యాంకులకు ఇచ్చామని తెలిపారు.