telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎట్టకేలకు శ్రీరెడ్డికి టాలీవుడ్ లో ఛాన్స్

Srireddy

సంచలన నటి శ్రీరెడ్డి వేధింపుల వ్యవహారం బయటపెట్టి పలువురిపై సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కొందరిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తోంది. ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద నటి శ్రీరెడ్డి మొదటి నుంచి టార్గెట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో మళ్ళీ తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది శ్రీరెడ్డి. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా మాత్రమే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటోంది. ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద వాళ్లను ఇన్వాల్వ్ చేయడమే కాకుండా వారిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడింది. దీంతో మొదటికే మోసం వచ్చింది. ఆమెకు అవకాశం ఇచ్చే నాథుడే లేకుండాపోయాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు, కామెంట్లు పెడుతూ కాలం వెళ్లదీస్తోంది. అప్పుడప్పుడు అందాలు ఆరబోసే ఫ్యాషన్ షోలు కూడా చేస్తోంది. అయితే, తాజాగా శ్రీరెడ్డికి టాలీవుడ్‌ నుంచి కాల్ వచ్చింది. ఒక సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ‘డ్రీమ్’ సినిమా దర్శకుడు భవాని శంకర్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తు్న్నారు. ‘క్లైమాక్స్’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. ఈ సినిమాలో శ్రీరెడ్డికి ఒక కీలక పాత్ర ఇచ్చారు. ఈ సినిమాలోనూ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్ర పోషించనున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, కమెడియన్ పృథ్వితో కలిసి శ్రీరెడ్డి స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనుంది. మర్డర్ మిస్టరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో వివాదాస్పద నటి పాత్రలో శ్రీరెడ్డి నటిస్తుండటం విశేషం. ఈ సినిమాతోనైనా శ్రీరెడ్డికి అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి.

Related posts