బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీబీఐ ఇన్వెస్టిగేషన్లో రియాను నిందితురాలుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. అయితే రియా బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. కానీ కోర్టు రియాకు బెయిల్ నిరాకరించి అక్టోబర్ 6 వరకు ఆమె రిమాండ్ ను పొడిగించింది. ప్రస్తుతం ఆమె బైకుల్లా జైల్లో ఉన్నారు. అరెస్ట్ కి ముందుగా ఆమెను నాలుగు రోజుల పాటుగా విచారించిన అధికారులు ఈ నెల 9న ఆమెను అరెస్ట్ చేశారు. ఇక ఈ విచారణలో రియా 25 మంది సెలబ్రేటిల పేర్లను చెప్పినట్టుగా కథనాలు వచ్చాయి. అందులో భాగంగానే నలుగురు హీరోయిన్ లను ఎన్సీబీ అధికారులు విచారించారు. ఇలా సుశాంత్ మరణించినప్పటి నుండి వార్తలలో నిలుస్తూ వస్తున్న రియా ప్రపంచ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. అయితే ఈ క్రమంలో రియా చక్రవర్తి పైన బయోపిక్ తీసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.. సినిమాల్లోకి యా చక్రవర్తి ఎంట్రీ ఇవ్వడం, సుశాంత్ సింగ్తో ఆమె ప్రేమ, సుశాంత్ మృతి అనంతరం ఆమెపై ఆయన తండ్రి ఆరోపణలు చేయడం, డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం లాంటి అంశాలను ఇందులో చూపించనున్నారట. ఇందులో లీడ్ రోల్ ఎవరు పోషిస్తారు మొదలగు లాంటి అంశాలు త్వరలో తెలియనున్నాయి. ఇక సినిమానే కాకుండా ఓ ప్రచురణ సంస్థ రియా చక్రవర్తి బయోపిక్ పై పుస్తకం తీసుకొచ్చేందుకు ఆమెతో కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లుగా సమాచారం.
previous post