ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్, వైసీపీగా ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే.. వైసీపీ నేతలు ఎన్ని కామెంట్లు చేసినా… నిమ్మగడ్డ తగ్గడం లేదు. ఇది ఇలా ఉండగా… ఏపీ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు నేటితో ముగియనున్నాయి. ఇవాళ సాయంత్రం ఐదింటి వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు అధికారులు. ఇవాళ్టి వరకు సర్పంచ్ పదవులకు 8773 నామినేషన్లు దాఖలు అయ్యాయి. రేపు దాఖలైన నామినేషన్లను పరిశీలించనున్నారు. నిన్న ఒక్కరోజే సర్పంచ్ పదవులకు 7460 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 25519వార్డు మెంబర్ పదవులకు నామినేషన్లు దాఖలయ్యాయి. అటు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల చిన్నపాటు గొడవలు అయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అధికారులు మొదటి విడత ఎన్నికల ప్రక్రియను సంక్రమంగా నిర్వహిస్తున్నారు. అటు కొన్ని పార్టీలు ఏకగ్రీవాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి కొన్ని చోట్ల సర్పంచ్ పదవుల వేలం పాట కూడా నిర్వహించిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
previous post
next post