telugu navyamedia
క్రైమ్ వార్తలు

క‌న్న కూతురిపై క‌సాయి తండ్రి అత్యాచారం..

విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కడుపున పుట్టిన కన్నకూతురి(5)పై కసాయి తండ్రి చినబాబు అత్యాచారం చేసాడు. చిన్నారి బాధ పడుతుండడంతో తండ్రి అరాచకం వెలుగులోకి వచ్చింది. దీంతో భర్తపై చినబాబుపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

వివారాల్లోకి వెళితే ..
కృష్ణా జిల్లా విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ తోపాటు… వికాస్ ఇంజనీరింగ్ కాలేజీల్లో చినబాబు అనే వ్యక్తి పిడి గా పనిచేస్తున్నాడు. చినబాబు కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఐదేళ్ల కూతురు ఉంది. భార్య ఇంట్లో లేని సమయంలో ఐదేళ్ళ కన్నబిడ్డపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు.

ప్రస్తుతం కీచ‌క తండ్రి ప‌రారీలో ఉన్నాడు. తండ్రి చేతిలో అత్యాచారానికి గురైన బాలికను ఆసుపత్రికి పంపించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసారు.

Related posts