telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

నాలుగేళ్ల కొడుకును గొంతు నులిమి హత్యచేసిన తండ్రి

New couples attack SR Nagar

కన్న పిల్లలను పోషించాల్సిన తండ్రి క్రూర మృగంలా మారాడు. క్షణికావేశంలో కన్న కొడుకునే గొంతు నులిమి హతమార్చాడు. ఈ దారుణ సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని శాలిగౌరారం మండలం తిర్మలరాయినిగూడెంలో తన కుమారుడు అక్షయ్(4)ను కనకయ్య అనే వ్యక్తి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. .గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ ఘాతకానికి పాల్పడినట్లు సమాచారం.

Related posts