కన్న పిల్లలను పోషించాల్సిన తండ్రి క్రూర మృగంలా మారాడు. క్షణికావేశంలో కన్న కొడుకునే గొంతు నులిమి హతమార్చాడు. ఈ దారుణ సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని శాలిగౌరారం మండలం తిర్మలరాయినిగూడెంలో తన కుమారుడు అక్షయ్(4)ను కనకయ్య అనే వ్యక్తి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. .గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ ఘాతకానికి పాల్పడినట్లు సమాచారం.
next post
రాజధానిని మార్చడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం: పవన్ కల్యాణ్