గుంటూరులో కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు. సోమవారం కౌలు రైతుల జిల్లా అధ్యక్షులు తోడేటి సురేష్ ఆధ్వర్యంలో కొల్లూరులో జిడిసిసి బ్యాంక్ ముందు కౌలు రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని, గ్రూపుల ఖాతాలు తెరవాలని విన్నవించి నెలలు గడిచినా రుణాలు ఇవ్వలేదని, కొల్లూరు జిడిసిసి బ్యాంక్ సిబ్బంది ఇంతవరకూ పట్టించుకోలేదని పేర్కొన్నారు.
కౌలు రైతుల ధర్నాకు స్పందించిన అధికారులు జిడిసిసి చైర్మన్తో చర్చలు నిర్వహిస్తామని చెప్పడంతో.. కౌలు రైతులు వేచి చూస్తున్నారు.