telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎఫ్ఎంజిఇ పరీక్షకు హాజరైన సాయిపల్లవి

Sai-Pallavi

“ఫిదా” సినిమాతో యువతను ఫిదా చేసి తనవైపుకు తిప్పుకుంది కేరళ బ్యూటీ సాయిపల్లవి. తన సహజ నటనతో సినీ ప్రియుల్ని అలరిస్తూ అనతికాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది ఈ బ్యూటీ. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండే సాయిపల్లవి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటుంది. ‘ఎంసీఏ’ ‘పడి పడి లేచే మనసు’ ‘కణం’ ,’మారి 2′, ‘ఎన్ జీ కె’ లాంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి అందర్నీ మెప్పించింది. ఈ రౌడీ బేబీ సాయిపల్లవి ఓ వైపు చదువులను కొనసాగిస్తూ.. మరోవైపు సినిమాల్లో కూడా రాణిస్తోంది. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన సాయి పల్లవి తాజాగా వైద్య విద్యకు సంబందించిన ఓ పరీక్షకు హాజరైంది. విదేశాల్లో మెడిసిన్ పూర్తి చేసే విద్యార్థులు భారత్‌లో మెడికల్ బోర్డు నిర్వహించే పరీక్షను తప్పకుండా పాస్ కావాల్సి ఉంటుంది. దాంతో విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన సాయిపల్లవి నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE) పరీక్షకు హాజరయ్యారు. తిరుచిలోని MAM కాలేజీలో ఆమె పరీక్ష రాశారు. దాంతో అభిమానులు పెద్ద ఎత్తున సాయిపల్లవితో సెల్ఫీలు దిగారు. 

Related posts