ఏపీ ప్రభుత్వం తుపాన్ బాధితులకు నేరుగా వారి ఖాతాల్లో నష్టపరిహరం వేసేందుకు నిర్ణయం తీసుకుంది.దీని కోసం ఆర్టీజీఎస్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం అందేలా చర్యలు చేపడుతోంది. నష్టం అంచనాపై అధికారుల సాయం కోసం ఎదురు చూడకుండా బాధితులే నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా ఏర్పాట్లను చేసింది.
‘పీపుల్ ఫస్ట్ యాప్’కు తుపాను నష్టం తాలూకు ఫోటోలను పంపాలని బాధితులను కోరింది. క్రౌడ్ సోర్సింగ్ ద్వారా తక్షణ మదింపు, చేసి నష్టపరిహారాలను నేరుగా బాధితుల, రైతుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తారు.. దీనిపై మరింత సమచారం కోసం 1100 కాల్సెంటర్కు ఫోన్ చేయాలని ఆర్టీజీఎస్ బాధితులకు సూచించింది.
కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది: యెడ్యూరప్ప