నేడు రాజధాని అమరావతి జనసేనాని పవన్ కల్యాణ్ ప్రాంతంలో పర్యటించారు. పలు గ్రామాల రైతులతో మాట్లాడడంతో పాటు రాజధానిలో నిర్మాణం జరుపుకుంటున్న ప్రభుత్వ భవనాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా నిడమర్రు గ్రామంలో పర్యటిస్తుండగా ఓ అభిమాని పవన్ ను ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ యువకుడు కొత్త చెప్పుల జతను పవన్ కు కానుకగా ఇచ్చాడు.
తమ ప్రాంతానికి పవన్ రావడం ఇదే ప్రథమం కాబట్టి, ఈ కానుక ఇచ్చానని, తాను బహుకరించిన చెప్పులతో పవన్ రాజధాని ప్రాంతంలో నడవాలని కోరుకుంటున్నానని ఆ యువకుడు వివరించాడు. ఆ అభిమాని ఇచ్చిన కానుక స్వీకరించిన పవన్ తన పర్యటనలో ఆ కొత్త చెప్పులను ధరించారు.