ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వేడి రాజుకుంది. ఎన్నికల తేదీలు కూడా సమీస్తుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాలకు సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరి 8న ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. బీజేపీ, ఆప్, కాంగ్రెస్లు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను రూపొందించింది.
ఈ జాబితాలో బాలీవుడ్, భోజ్పురి తారలతో పాటు పలువురు కళాకారుల పేర్లు ఉన్నాయి. ఆ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, భోజ్పురి సూపర్ స్టార్ పవన్ సింగ్, ఖేసరి లాల్ యాదవ్, నిర్హువా, ఎంపీ రవికిషన్, సన్నీడయోల్, హేమామాలిని, సప్నా చౌదరి, హేమంత్ బిశ్వాశర్మ, ముఖ్యమంత్రి సోనేవాల్, గిరిరాజ్ సింగ్, సుశీల్ మోదీ, స్మృతి ఇరానీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, దేవేంద్ర ఫడ్రవీస్, మనోజ్ తివారి తదితరుల పేర్లు ఉన్నాయి.