telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

పిల్లలకు ఉరేసి తల్లిదండ్రుల ఆత్మహత్య

New couples attack SR Nagar

మహారాష్ట్రలోని పూణె నగరంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పల్ల్పడ్డారు. నగరంలోని సుఖ్‌సాగర్‌కు చెందిన తల్లిదండ్రులు తమ ఇద్దరు పిల్లలకు ఉరివేసిన అనంతరం వారు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదయం వారు నలుగురు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసిన ఇరుగుపొరుగ వారు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో సుఖ్‌సాగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Related posts