telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

Engineering college Fees student sulcide

ఆర్థిక సమస్యలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని ఈ సంఘటన మిర్యాలగూడలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే మిర్యాలగూడలోని సంతోష్ నగర్ కి చెందిన పారేపల్లి లోకేష్ గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం కూల్ డ్రింక్ లో విషం కలుపుకొని లోకేష్ తాగాడు. అనంతరం విషం కలిపిన కూల్ డ్రింక్ ని అతని భార్య(40) కుమారుడు లోహిత్(14)లతో కూడా తాగించాడు. దీంతో వారు మృతి చెందారు. ఆర్థిక సమస్యల కారణంగానే వారు ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతోనే ఇంతటి ఘోరానికి పాల్పడ్డారని లోకేష్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ ద్వారా బయటపడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Related posts